ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నఈయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. శివరామకృష్ణన్ మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలువురు రాజకీయనేతలు సంతాపం తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu