మరోసారి బుక్కయిన సిద్దరామయ్య... ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిద్ర..


సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేప్పుడు కానీ.. పార్లమెంట్ లో కానీ మన రాజకీయ నేతలు నిద్రకు ఉపక్రమించడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలా నిద్రకు ఉపక్రమించి బుక్కయ్యారు ఓ నేత. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని మెడకు చుట్టుకుని ఉండే సిద్ద రామయ్య... బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మరో నేత మాట్లాడుతుండగా... ఆయన నిద్రలోకి జారుకున్నారు. అదికాస్త  కెమెరా కంటికి చిక్కి బయట పడటంతో ఇప్పుడు పెద్ద చర్చాంశనీయంగా మారింది.