మోడీ ఇండియనా లేక ప్రవాస భారతీయుడా..? విరుచుకుపడిన శివసేన..


బీజేపీ పై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శివసేన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడింది. మోడీ విదేశీ పర్యటనల గురించి నిప్పులు చెరిగింది. మోడీ ఎప్పుడు చూసిని విదేశీ పర్యటనలు చేస్తుంటారు.. ఆయన భారత పౌరుడా..? లేక ప్రవాస భారతీయుడా..? అంటూ తన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. అంతేకాదు ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా.. ఒక్క రాష్ట్రంలో మాత్రమే గెలుపొంది.. మిగిలిన రాష్ట్రాల్లో తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అలాంటిది.. ఆ విషయాన్నే మరిచిపోయి సంబరాలకు ఎలా రెడీ అవుతున్నారు అని ఎద్దేవ చేశారు. మోదీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించినా, అవి క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర కావడం లేదని.. బ్లాక్ మనీని తిరిగి వెనక్కు తెప్పించడంలోనూ మోదీ సర్కారు విఫలమైందని శివసేన దుయ్యబట్టింది. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu