షర్మిల గాయం ఏదీ లేదే.. గాయబ్..పోయిందే!

వైఎస్సార్ టీపీ అధినేత్రి వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద ఆమె పాదయాత్ర పై రాళ్లదాడి, కాన్వాయ్ లోని వామనం దగ్ధం ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు రోజుల కిందట ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ఆమె తన గడ్డం, పెదవిపై తగిలిన గాయాలను మీడియాకు చూపించి రాజశేఖరరెడ్డి బిడ్డను, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న మహిళను తెరాస ప్రభుత్వం ఈ విధంగా గాయపరుస్తుందా అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇది గడిచి రెండు రోజులు అయ్యింది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంపై గాయమే కాదు.. ఆ గాయం తాలూకు మచ్చ కూడా కనిపించలేదు. దీంతో ఆమె నిజంగా గాయపడ్డారా అన్న అనుమానాన్ని తెరాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. గాయం పేరుతో మీడియా ముందు ఆమె సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి విమర్శించారు. అయినా గాయాలు అంత తొందరగా మానిపోయే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయా  అని సెటైర్ వేశారు. ఇప్పటికైనా షర్మిల  వ్యక్తిగత విమర్శలు మానుకుని బుద్ధిగా పాదయాత్ర చేసుకుంటే మంచిదని హితవు పలికారు.