శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం

రైళ్లలో దోపిడీ దొంగల ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయి, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని రైల్వే అధికారులు చెబుతున్నా, దొంగల ఆగడాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. రెండ్రోజుల క్రితం సింహపురి ఎక్స్ ప్రెస్ లో లేడీ ఐపీఎస్ పై జరిగిన దాడిని మరిచిపోకముందే, మరో ట్రైన్ లో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. కాకినాడ నుంచి బెంగళూర్ వెళ్తున్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో చొరబడిన దొంగలు... నెల్లూరు జిల్లా మనుబోలు దగ్గర చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్-2, ఎస్-7, ఎస్-8 కోచ్ లలో ప్రయాణికులను కత్తులతో బెదిరించిన దొంగలు...నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు.ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu