భారత్ నిర్ణయాలతో వణికిపోతున్న పాకిస్థాన్...
posted on Sep 28, 2016 3:40PM

భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు పాకిస్థాన్ వణికిపోతోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందంపై.. ఆ తరువాత పాకిస్థాన్ కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత అనుకూల దేశం) హోదాను పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధానికి దిగింది. అయితే భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై స్పందించిన నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్థాన్ పై యుద్ద చర్యగానే భావిస్తున్నామని అన్నారు. ఇంకా సింధూ జలాల ఒప్పందంపై మాట్లాడుతూ.. 'అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదు'.. ఈ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంది. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు నది ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయలేదని, ఒప్పందాన్ని రద్దుచేయడానికిగానీ, ఒప్పందం నుంచి తప్పుకోవడానికిగానీ ఎలాంటి నిబంధనలు లేవని, ఇది కుదరదని సర్తాజ్ అజిజ్ పేర్కొన్నారు.