ముందు మీ డబ్బు వాడండి.. తెలుగు రాష్ట్రాలకు వెంకయ్య సలహా

 

గత రెండు మూడు రోజుల కిందట భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల వల్ల ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా రైతుల పంటపొలాలు మొత్తం నీటితో మునిగిపోయి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేశారు. తాను స్వయంగా వరదల్లో మునిగిన ప్రాంతాలను పరిశీలించాలని.. కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. అంతేకాదు.. కేంద్రం నుంచి వచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్రాల వద్ద ఉన్న విపత్తు నిధి నుంచి డబ్బు ఖర్చు చేసి బాధితులను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు సలహా ఇచ్చారు. పంట నష్టం అంచనాలపై కేంద్ర మంత్రులకు తాను వివరించి చెప్పానని, కేంద్ర బృందాలను పంపాలని సిఫార్సు చేశానని వివరించారు. రెండు రాష్ట్రాలూ పంట నష్టం అంచనాలను పంపిన తరువాత అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu