ఏసీబీకి సహకరిస్తా.. సండ్ర

నోటుకు ఓటు కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనాలని తెలంగాణ ఏసీబీ అధికారులు సండ్ర వెంకట వీరయ్య నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాలేదని పదిరోజులు గడువు కావాలని తరువాత విచారణలో పాల్గొంటానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇచ్చిన గడువు ముగియడంతో సండ్ర ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. తాను డిశ్చార్జయ్యానని.. ఇక నుండి ఖమ్మంలోని తన ఇంట్లోనే ఉంటానని.. ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏసీబీకి లేఖ రాసిన తరువాత తనను ఎవరూ కలవలేదని కూడా సండ్ర తెలిపారు. సండ్ర తోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయగా.. వేం అప్పుడే విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu