రోజా పిటిషన్ పై రేపు తుదితీర్పు..


ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రోజా తరపు లాయర్ ఇందిరా జైసింగ్ తమ వాదనలు వినిపించారు. స్పీకర్ నిబంధనలకు విరుద్దంగా రోజాను సస్పెండ్ చేశారని.. ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని.. ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని ఆమె అన్నారు.  ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు లాయర్ కూడా తన వాదనలు వినిపించారు. 194(3) నిబంధన కింద చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో వినిపించారు.

 

కాగా ఇరువాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu