పాక్‌పై రోహిత్ హాఫ్ సెంచరీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్థశతకం సాధించాడు. 71 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 55 పరుగులు సాధించాడు. 49 పరుగుల వద్ద షాదాబ్ వేసిన 18.5వ బంతిని సిక్సర్‌ బాది శతకం పూర్తి చేయడంతో పెవిలియన్‌లో కూర్చొన్ని వారు చప్పట్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 126 పరుగులు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu