రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు..

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు అందాయి. గత ఏడాది డిసెంబర్ లో రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆరెస్సెస్ రాహుల్ గాంధీపై కామ్ రూప్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు పిటిషన్ లో కోర్టును ఆరెస్సెస్ కోరింది. ఈ పిటిషన్ పై నేటి ఉదయం విచారణ చేపట్టిన కోర్టు... ఈ నెల 29న వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని రాహుల్ ను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu