మీరు పని చేసే ప్రదేశం లో సరిగ్గా కూర్చుంటున్నారా ?

అలా సరిగా కూర్చోనట్లయితే అష్టా వక్ర భంగిమలలో మీరు కూర్చుంటే వెన్ను నొప్పి, మెడ నొప్పికి ఆహ్వానం పలికినట్లే అని అంటున్నారు నిపుణులు.ఈ మధ్య కాలం లో స్మార్ట్ ఫోన్ వినియోగం ల్యాప్ టాప్ వినియోగిస్తూ దీర్ఘకాలం పాటు కూర్చుంటున్నారా బెడ్ పై పడుకునే టప్పుడు బెడ్ సరిగ్గా ఉందా ?సరైన భంగిమలో పడుకుంటు న్నారా ?అలా కానట్లయితే మీ చేతి వేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూస లోని జాయింట్స్ అరిగి పోతాయి. ఆస్టియో ఆర్తరైటిస్ వంటి వ్యాధులు బారిన పడతారు. మీరు దీర్ఘ కాలం పాటు వాడకం లేదా కూర్చునే భంగిమ పడుకునే భంగిమ లో ఏమాత్రం తేడా ఉన్నా సరిగ్గా లేకపోయినా మీవేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూసా అరిగి పోతుంది.4౦ సంవత్సరాలు పై బడిన వారిలో వచ్చే ఆస్టియో ఆర్తరైటిస్ వల్ల కీళ్ళు,జాయింత్స్ లో అరుగుదల కనిపించించింది.ఈ సమస్య ఇప్పుడు 2౦ సం వచ్చరాల వాళ్ళలో అరుగుదల కనిపిస్తుంది.
దాదాపు దగ్గర ఫగ్గర 1౦ నుండి 15%సమస్యలు  15౦ మంది రోగులలో రోమటాలజీ విభాగం లైఫ్ స్టైల్ డిజార్దర్ గా  పేర్కొన్నారు.ఇటీవల కాలం లో వెన్ను నోప్పితో బాధపడుతున్నారన్న పలురోగులను హెచ్ ఓ డి ప్రొఫే సర్ ఉమాకుమార్ అవుట్ పేషంట్ బ్లాక్ లో చూస్తున్నప్పుడు వచ్చిన పలు సమస్యసలను ప్రస్తావించారు. ఒక కేజీ బరువు పెరిగినా ఒత్తిడి పెరిగి కీళ్ళు పిరుదల పై నుండి ౩ నుండి 6 రెట్లు నొప్పులు పెరుగుతాయి.మెడను వంచడం 15 డిగ్రీ ల యాంగిల్ లో ఉంటె స్మార్ట్ ఫోన్ మాట్లాడం వల్ల 11 కే జీల బరువు పెరిగి మెడ వెన్ను నొప్పికి దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ఎవరైతే ఎక్కువగా ౩౦ డిగ్రీల యాంగిల్ లో కింది భాగం లో స్మార్ట్ ఫోన్ లో చూస్తారో 18 కే జి ల ఒత్తిడి పెరిగి వెన్ను మెడ నొప్పి కి సంబందించిన సమస్యలు వస్తాయి.మీ మెడను కిందికి వంచే బదులు ఫోన్ ల్యాబ్ టేబ్ పైన పెట్టుకోవాలని దీని వల్ల కంటిని కాపాడవచ్చునని డాక్టర్ కుమార్ అన్నారు.ఎప్పుడైతే భుజాలు మెడ ముందుకు వంగు తాయో ముందు భాగం లో ఉన్న కండరాలు గట్టి పడి వెనుక వైపు భాగం లో ఉన్న నరాలు కండరాలు బలహీన పడతాయి ఈ కారణంగా ఒక పక్కన కండరాలు బలహీన పది కండరాల మధ్య సమతౌల్యం లోపించి దీనివల్ల స్పోండి లైటిస్ స్పొండోలసిస్ వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ కుమార్ వివరించారు.

ఆర్తరైటిస్ కు అవుట్ పెషంట్ గా వస్తున్నారని అంకి లోజింగ్ స్పాం డి లైటిస్ రోమటైద్ ఆర్తరైటిస్ వంటి సమస్యలతో వస్తున్నట్లు గుర్తించామన్నారు.జీవన శైలి విధానాల వల్ల సమస్యలతో బాధపడుతున్నారని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గా డాక్టర్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి రోగులకు  ఆక్యుపేషనల్ తెరఫీ ని సూచించి నట్లు తెలిపారు అదీ వారు కూర్చునే భంగిమజీవన శైలి విధానం లో మార్పులు చేస్తే కొంత మేర సమస్యనుండి బయట పడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్భంగా ఒక కేసు విషయాన్ని ప్రస్తావించారు.ఇతను 2౩ సంవత్చరాల పురుషుడు  అతను ఎక్జి క్యుటివ్ గా పనిచేస్తున్నారు కాల్ సెంటర్ లో పనిచేసే ఉద్యోగని తెలిపారు అతను వెన్ను నొప్పి తో బాధపడుతున్నాడని ఓపి డిలో నమోదు చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి చేతి వేళ్ళు స్పర్స లేకుండా పోయాయని. నాలుక పై భాగం సైతం తిమ్మిరిగా స్పర్స కోల్పోయారని నిర్ధారించారు.పూర్తి పరీక్షలు నిర్వహించిన తరువాత అతని కూర్చునే భంగిమలో పడుకునే భంగిమలో తప్పు ఉందని మొబైల్ ఫోన్ కీబోర్ద్ ఎక్కువ సేపు వినియోగిస్తున్నాడని చాలా ఫోన్స్ మాట్లాడాల్సి ఉంటుందని అప్పుడు మొబైల్ ఫోన్ 6 నెలల పాటు జీవనశైలి లో మార్పులు చేయాలని  సూచించామని అన్నారు. అయితే అతనికి యాంకిలో జింగ్ స్పోండి లైటిస్ గా నిర్ధారించారు.అందుకు ప్రజలు వారి వారి పని చేసే ప్రదేశాలలో వారు కూర్చ్గునే భంగిమ నిటారుగా గుర్తించడం వాటిని వారు నియంత్రించుకోవాలి వారికి అత్యధికంగా నొప్పి వచ్చినప్పుడు మార్చుకునే ప్రాయత్నం చేయాలి అందుకోసం ఆర్గనామిక్ సెట్ అప్ చేసుకోవాలి.మోచేయి 9౦%టేబుల్ ల్యాబ్ టాబ్ టేబుల్ పై ఉండే విధంగా మానీటర్ మీకీబోఅర్డ్ కింది భాగం లో ఉండాలి 2౦ నిమిషాల తరువాత 2౦ సెకండ్లు విరామం అవసరం సుదీర్ఘంగా పనిచేయకుండా విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు కూర్చ్గున్నవద్దె కదలకుండా పనిచేస్తే సమస్యలు తప్పవని నిపుణులు పేర్కొన్నారు.