భారత కార్మికులతో మోడీ భోజనం..

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఖతార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దోహలోని భారత కార్మికుల క్యాంప్‌ను నిన్న సాయంత్రం ఆయన సందర్శించారు. అక్కడ పని చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మోడీ భోజనం చేశారు. సాక్షాత్తూ ప్రధాని తమతో కలిసి భోజనం చేయడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఉత్తమ ప్రధాని అని, మా కుటుంబసభ్యుల్లోని ఒకరు తమతో కలిసి భోజనం చేసినట్లుందని కార్మికులు ఉద్వేగంతో చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu