ప్రకాశ్ రాజ్ కూడా వేలు పెట్టాడుగా...!

 

తాజ్ మహల్ వివాదంపై ఇప్పటికే పెద్ద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. యూపీ ప్రభుత్వం పర్యాటక పుస్తకంలో తాజ్ మహల్ ను చేర్చకపోవడం.. ఇక బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తాజ్ మహల్ ‘భారత సంస్కృతికి కళంకం’’ అని… ఇది ‘‘దేశ ద్రోహులు’’ నిర్మించిన కట్టడమని వ్యాఖ్యానించడంతో అసలు రచ్చ మొదలైంది. ఆతరువాత పలువురు నేతలు దీనిపై స్పందించి అనేక వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు ఈ జాబితాలో నటుడు సూపర్ స్టార్ కూడా చేరిపోయారు. తాజ్ మ‌హ‌ల్ చ‌రిత్ర త‌వ్వ‌కాలు మొద‌లుపెట్టార‌ని, ఇంత‌కీ తాజ్ మ‌హ‌ల్ ను ఎప్పుడు ప‌డ‌గొట్టాల‌ని అనుకుంటున్నారో చెబితే…త‌న పిల్ల‌ల‌కు చివ‌రిసారిగా తాజ్ మ‌హ‌ల్ ను చూపిస్తాన‌ని ట్వీట్ చేశారు. అంతేకాదు..  ప్రశ్నించడం అనేది నా ప్రాధమిక హక్కు..నేను ప్రస్నిస్తూనే ఉంటా..నా ప్రశ్నల వర్షం కొనసాగిస్తా అంటూనే..భావాలని విభేదించే హక్కు అందరకీ ఉంటుంది నాపై విమర్శలు అదేపనిగా చేయడం మానుకుంటే మంచిది అని కూడా మరో ట్వీట్ చేశాడు. ఎవరెవరు నాపై విమర్శలు చేస్తున్నారో వారి పదజాలం చాలా అసహ్యం కల్గిస్తోంది.మీరు చేసే నాపై అంటున్న ప్రతీ మాట నా మనోభావాలని మరింత ఎక్కువగా స్వేచ్ఛగా నేను చెప్పడానికి నన్ను తయారు చేస్తోంది అని అన్నారు. కాగా ఇటీవల.. ప్రకాశ్ రాజ్ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన జ‌ర్న‌లిస్ట్ గౌరీలంకేశ్ హ‌త్య విష‌యంలో ప్ర‌ధాని మోడీ వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.