ముంబై టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ముంబైలో జరుగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించి..మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది కోహ్లి సేన. 182/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను అశ్విన్ కోలుకోలేని దెబ్బ తీశాడు. అశ్విన్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత వచ్చిన వారు నిలబడలేకపోవడంతో ఇంగ్లీష్ జట్టు ఓటమి ఖాయమైంది. దీంతో 36 పరుగుల ఇన్నింగ్స్ పరాజయంతో సిరీస్‌ను భారత్‌కు అప్పగించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu