మోడీ విద్యార్హతలపై వెనక్కి తగ్గని ఆప్..
posted on May 10, 2016 11:47AM
ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే తనకు తెలియజేయాలని సమాచారహక్కు కమిషనర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వారు కూడా మోడీ గుజరాత్ యూనివర్శిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ నుండి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారని.. మోడీ సంబంధించిన విద్యార్హతల గురించి తెలియజేశారు. అంతేకాదు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను బయటపెట్టిన సంగతి కూడా విదితమే. అయితే మోదీ డిగ్రీ పత్రాలు నకిలీవంటూ ఆమ్ ఆద్మీ పార్టీనేతలు ఆరోపిస్తోన్నారు. ఈ విషయంలో వారు ఏ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. దీనిలో భాగంగానే.. నేడు ఢిల్లీ వర్సిటీలో ఆప్ నేతలు ప్రధాని మోదీ డిగ్రీ వివరాలపై ఆరా తీయనున్నారు. అమిత్ షా మీడియాకు చూపిన సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసినవేనని, ఢిల్లీ వర్శిటీకి తాము వెళ్లి, సదరు పత్రాలను పరిశీలించి తీరుతామని ఆప్ నేతలు తెలిపారు.