నెహ్రూగారినే "డిలీట్" చేసిన బీజేపీ ప్రభుత్వం..!

 

రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పట్ల తీవ్ర అపచారం చేసింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో భారత చరిత్రను చెబుతూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీరసావర్కర్, భగత్‌సింగ్ తదితరులతో పాటు స్వాతంత్ర్య సమరయోధుడిగా పెద్ద పరిచయం లేని హేము కలానీ వంటి వారి పేర్లను స్వాతంత్ర్య పోరాట యోధులుగా ప్రచురించింది. అయితే దీనిలో ఎక్కడా నెహ్రూ ప్రస్తావనే లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెబుతూ ఓ చాప్టర్‌నే పొందుపరిచారు. దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అని పేర్కొన్నారు. కానీ తొలి ప్రధానిని గురించి చెప్పలేదు. ఈ చర్యను ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, నవ భారత నిర్మాతగా, తొలి ప్రధానిగా దేశ చరిత్రనే తిరగరాసిన వ్యక్తిని మరచిపోవడం కావాలని చేసిన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. జరిగిన తప్పిదాన్ని వెంటనే సరిచేసుకోవాలని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.