ఆ ప్రకటన వెనుక ఉన్నది అతడేనా..?

 

"అత్తారింటికి దారేది" చిత్ర సక్సెస్ థ్యాంక్స్ వేడుకలో పవన్ మాట్లాడిన మాటలకు, త్వరలోనే పవన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నిటికీ సమాధానంగా మెగాబ్రదర్ నాగబాబు ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసారు. అయితే ఈ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్, నాగబాబు టీడీపీలో చేరుతున్నారని వార్తలు రావడంతో.. వీటిపై చిరు స్పందించి తమ్ముళ్ళ చేత ఈ పని చేయించినట్లుగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లో ఇప్పుడిప్పుడే ఒక స్థానంలో ఉన్న చిరుకి.. ఇలా తమ్ముళ్ళు వేరే పార్టీలో చేరుతారనే విషయం తన పార్టీ సన్నిహితులు చిరుని అడగడం వల్లనే.. చిరు కావాలని నాగబాబు చేత ఈ ప్రకటన చేయించాడని వార్తలు వస్తున్నాయి.మరి వీటి వెనుక అసలు విషయం ఏమిటో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.