పఠాన్ కోట్ లా మరో భీకర దాడి.. నిఘా వర్గాల హెచ్చరిక..

 

పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో దాడి జరపడానికి.. ఏ క్షణమైనా ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని.. భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు దీనికోసం జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని..  పఠాన్ కోట్ దాడికన్న భీకర దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారుని.. దీనికి సంబంధించిన నివేదికను పంజాబ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఈ దాడులకు ప్రధాన సూత్రధారి పాక్ లోని ఒకారా ప్రాంతానికి చెందిన అవాసీ అని.. జైషే మహమ్మద్ కమాండర్ అయిన అవాసీ స్వయంగా మలేషియా మీదుగా భారత్ కు రావాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఇంకా ఈ దాడుల కోసమే పాక్ లో జైషే మహమ్మద్ మరో మూడు కార్యాలయాలు తెరిచిందని నిఘా వర్గాలు తెలిపారు. దాడులు ఎప్పుడైనా జరగవచ్చని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.