రేపటికి వాయిదాపడ్డ కెసీఆర్ పిటిషన్
posted on Jul 15, 2024 6:00PM
పదేళ్ల బి ఆర్ఎస్ హాయంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయి. వార్తలు ఈ నేపథ్యంలో జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే డిమాండ్ చేశారు. కెసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను రేపు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మొదట కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. కోర్టు పని వేళలు ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో రేపు ఉదయానికి వాయిదా వేసింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై కమిషన్ వేసింది. విచారణ రావాలంటూ కమిషన్... కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయపోరాటం ప్రారంభించారు. హైకోర్టులో కెసీఆర్ కు చుక్కెదురు కావడంతో కెసీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. తనకు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడంపై ఆయన సు ప్రీంకోర్టు గడప దొక్కారు.చత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు.