ధనుష్ హీరోయిన్ పై నయనతార గరం గరం

 

కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార.. మలయాళ నటి నజ్రియా నజీమ్‌ పై తీవ్రంగా మండిపడుతుంది. ఎందుకంటే ధనుష్ హీరోగా "నైయాండి" అనే చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్‌ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకోసం దర్శకుడు తనను అసభ్యంగా చూపించారంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి, పెద్ద సంచలనం చేసిన ఈ అమ్మడి ప్రవర్తనపై కోలీవుడ్ చాలా కోపంగా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నయనతార నజ్రియాను తనదైన శైలిలో హెచ్చరించింది. "నిజానికి ఆ సన్నివేశాలను మరీ అంతగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మరీ పద్దతిగా పోతే సినిమా కలెక్షను దెబ్బతింటాయి జాగ్రత్త" అంటూ నజ్రియాపై మండిపడింది. మరి దీనికి నజ్రియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu