మంత్రితో బాలయ్య మంతనాలు

 

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎం.పి. బిల్డింగ్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ చిత్రీకరణలో భాగంగా బాలకృష్ణకు ఓ మంత్రిగారికి మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నేటితో ఇక్కడ చిత్రకరణ పూర్తవుతుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకోనున్నారు. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu