ఆంబోతులా... ఎంత మాటన్నావ్ నారాయణా!

సీపీఐ నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై విరుచుకుపడ్డ నారాయణ.... ఆ ముగ్గురినీ ఏకంగా ఆంబోతులతో పోల్చినట్లు వార్తలు వస్తున్నాయి, దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.... మోడీ, బాబు, కేసీఆర్ లు కొత్త పెళ్లికొడుకుల్లా విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు, అన్నదాతలు ఆక్రందనను పట్టించుకోకుండా ఆంబోతుల్లా తిరుగుతున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలతో గతంలో చిక్కులు కొనితెచ్చుకున్న సీపీఐ నారాయణ... తాజా కామెంట్స్ తో ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో చూడాలి