తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం(ఏప్రిల్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఏప్రిల్ 28) శ్రీవారిని మొత్తం 85వేల 241 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 31 వేల 730 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండడీ కానుకల ఆదాయం 3 కోట్ల 65లక్షల రూపాయలు వచ్చింది.