భోగాపురం సముద్రం ఒడ్డుకి చేరిన చిన్నారి అదితి మృతదేహం

 

వారం రోజుల క్రితం విశాఖనగరంలో ప్రమాదవశాత్తు ఒక కాలువలో పడికొట్టుకుపోయిన ఆరేళ్ళ చిన్నారి అదితి, గురువారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం వద్ద గల సముద్ర తీరానికి శవమై కొట్టుకు వచ్చింది. ఆమె తండ్రి సత్య శ్రీనివాసరావు పాప ఒంటిపై ఉన్న దుస్తులను బట్టి ఆమె తన కూతురేనని దృవీకరించారు. గత వారం రోజులుగా పాప పడిపోయిన చోట నుండి సముద్రం వరకు గల కాలువలను, చివరికి సముద్రంలో కూడా హెలికాఫ్టర్ ద్వారా గాలించినప్పటికీ ఆమె ఆచూకి దొరకకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కానీ చివరికి ఆ చిన్నారి అదితి పక్క జిల్లాలో సముద్రం ఒడ్డున శవం అయి తేలింది. ఇంతవరకు ఆశగా ఎదురుచూసిన పాప తల్లితండ్రుల ఆ చిన్నారిని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం విశాఖకు తరలించారు.