నేటి నుండి తెదేపా కార్యకర్తలకు నారా లోకేష్ శిక్షణ

 

తెదేపా యువనేత నారా లోకేష్ నేటి నుండి పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలను మొదట తిరుపతి నుండి మొదలుపెడతారు. ఆ తరువాత వరుసగా కందుకూరు, తాడేపల్లిగూడెం, అరుకు తదితర ప్రాంతాలలో పర్యటించి పార్టీ కార్యకర్తలకు ఆయన స్వయంగా శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు. పార్టీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల పట్ల వారికి అవగాహన కల్పించిన తరువాత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని మరిన్ని వివరాలను ఏవిధంగా తెలుసుకోవాలి? సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని తిరిగి ప్రజలకు ఏవిధంగా చేరవేయాలి? అనే అంశాలపై ఆయన పార్టీ కార్యకర్తలకు నిపుణులచేత శిక్షణ ఇప్పించబోతున్నారు.