జానకిరామ్ దుర్మరణం.. చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి

 

నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ నల్గొండ జిల్లా మునగాల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, జానకిరామ్ బంధువు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో జానకిరామ్ మరణించిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన షాక్‌కి గురయ్యారు. పోలీసు అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన విధాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటన గురించి తెలిసి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu