శివప్రసాద్ పై సందీప్ దీక్షిత్ దాదాగిరి
posted on Sep 2, 2013 3:25PM

సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ సభలో నోరుపారేసుకున్నారు. టీడీపీ ఎంపీలు ఇందిరాగాంధీ మాస్క్ పెట్టుకుంటే చంపేస్తానని, ఢిల్లీలో లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీ సందీప్ దీక్షిత్కు టి.కాంగ్రెస్ ఎంపీలు వత్తాసు పలికారు. దీనిపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు అందరికి ఉందని, కాని టిడిపి ఎమ్.పి ఎన్.శివప్రసాద్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, ఎమ్.పి సందీప్ దీక్షిత్ గూండా గిరి చేశారని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలుగుజాతి గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.ఎంపీ నామా నాగేశ్వర్రావు ఎంపీ సందీప్పై స్పీకర్కు ఫిర్యాదు చేశారు.