యువతి పై ప్రియుడు యాసిడ్ దాడి

 

 

 

అనంతపురం జిల్లాలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధినిపై నగర శివారులో జాతీయ రహదారిపై ఇద్దరూ దుండగులు యాసిడ్ తో దాడి చేశారు. యువతీ జాతీయ రహదారిపై కళాశాల బస్సు దిగి వెళ్ళుతుండగా ఇద్దరూ యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈఘాతుకానికి పాల్పడ్డారు. తన స్వగ్రామానికి చెందిన రాఘవ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఈ దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలు పోలీసులకు తెలిపారు. రాఘవ తనని వేదిస్తున్నాడని రెండు నెలల క్రితం ముదిగుబ్బ పోలీసుస్టేషన్లో పిర్యాదు చేసింది. బాధితురాలు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu