చిన్నారిని రైలు కింద తోసి తానూ...

 

కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళు తమతోపాటు తాము కన్నవారిని కూడా చంపేస్తున్నారు. ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ ఘటనను మరువకముందే హైదరాబాద్‌లో ఓ తల్లి తన కూతురితో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ నగర్‌లో వున్న మ్యారీగోల్డ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం వుండే శ్యాంప్రసాద్, స్వప్నకు అక్షద్ (1) శాన్వి (2) సంతానం. సోమవారం ఉదయం సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నానని చెప్పి కూతుర్ని తీసుకుని ఇంట్లోంచి బయటకి వెళ్ళిన స్వప్న ఆ తర్వాత కనిపించలేదు. హైదరాబాద్ నగర శివార్లలోని ఘట్‌కేసర్ దగ్గర రైల్వే ట్రాక్‌ మీద తల్లీ కూతుళ్ళ మృతదేహాలున్నాయని తెలిసి అక్కడకి వెళ్ళిన పోలీసులు, కుటుంబ సభ్యులకు వాళ్ళు స్వప్న, శాన్వి అని తేలింది. వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా స్వప్న తన పాపను నిలబెట్టి, రైలు దగ్గరకు వచ్చిన సమయంలో తాను కూడా రైలు కిందకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు  చెబుతున్నారు. కుటుంబ కలహాలే ఈ సంఘనటనకు కారణమని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu