అధికారుల నిర్లక్ష్యం చంద్రబాబు ఆగ్రహం

 

ప్రజలు సమస్యల్లో వున్నప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వుంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తుఫాను సహాయక చర్యలపై విశాఖలో మంగళవారం నాడు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. అధికారులు పీఎం, సీఎంలను దృష్టిలో పెట్టుకుని కాదు, సామాన్యుడి కోసం పనిచేయాలని సూచించారు. ఆహారం, మంచినీళ్ళ విషయంలో ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూడాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరా వెంటనే జరగాలని ఆయన ఆదేశించారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలని కోరారు. తాగునీటి పంపిణీ, విద్యుత్ సరఫరా ఎంతవరకు వచ్చాయని చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu