అర్ధరాత్రి మోడీ ఫోన్.. షాకైన అధికారి..

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి ఫోన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడీ.. ఏంటీ అర్థరాత్రి ఫోన్ ఏంటీ అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. మోడీ త్రిపురకు చెందిన ఓ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేశారంట. ఆ అధికారి ఫోన్ ఎత్తిన వెంటనే మోడీ పీఎంవో లో ఓ అధికారి "ప్రధాని మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు" అని చెప్పాడు. ఆ మాటతో షాకైన సదరు ఐఏఎస్ అధికారి తేరుకునే లోపు నరేంద్ర మోదీ లైన్ లోకి వచ్చారు. ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలని కోరతూ అసలు విషయం చెప్పారు. వర్షాల కారణంగా త్రిపురను ఇతర రాష్ట్రాలతో కలిపే ఎన్ హెచ్ 208 (ఏ)ను వెంటనే పునరుద్ధరించాలని, పనులు దగ్గరుండి చూసుకోవాలని కోరారు. ఇక అనంతరం.. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అధికారులు, కార్మికులు హుటాహుటిన పనులు జరిపి నాలుగు రోజుల్లో రహదారిని బాగు చేసేశారు. దీంతో రవాణా మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి అభినందనలు కూడా అందాయి. ఢిల్లీకి వచ్చినప్పుడు పీఎంఓకు వచ్చి మోదీని కలుసుకోవాలని కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ మేటర్ మొత్తం ఎలా లీకైందంటే... ఐఏఎస్ అధికారి స్నేహితుడి కుమారుడు జరిగిన విషయం మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విషయం కాస్త బయటపడింది.