రోజా సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ..

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అసెంబ్లీ తనపైన విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ రోజా ముందు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురై..అనంతరం హైకోర్టు బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో ఇంకా విచారణ కాకముందే రోజా తన పిటిషన్ ను ఉపసంహరించుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మొదట దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. తాము ఇప్పుడు విచారించలేమని చెప్పి.. ఈరోజుకు వాయిదా వేసింది. మరి ఈరోజు విచారణలో అయిన రోజుకు ఊరట కలుగుతుందో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu