బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం
posted on Jun 5, 2025 5:59PM
.webp)
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. మాగంటి గోపీనాథ్ను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.గతంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురియ్యారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, పలువురు నాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మరోవైపు మాగంటి ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులను మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం గోపీనాథ్ వెంటీలేటర్ మీద చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్టు మాజీమంత్రి తెలిపారు