బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మారిషస్ అధ్యక్షుడు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న  కనకదుర్గ అమ్మవారిని  మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు.  ధర్మబీర్ గోఖూల్ దంపతులకు దేవాలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు   ఆశీర్వచనం అందించారు.

ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. దర్శనం అనంతరం మారిషష్ దేశాధ్యక్షుల దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి-గుంటూరు వేదికగా జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విదితమే.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu