మావోయిస్టుల్ని చంపిన జనం

 

మావోయిస్టులంటే గ్రామస్థులు భయంతో వణికిపోతూ వుంటారు. అయితే గ్రామస్థులు తిరగబడి ముగ్గురు మావోయిస్టులను చంపేసిన ఘటన విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం కోరుకొండలో జరిగింది. మావోయిస్టులు ఆదివారం రాత్రి ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో సంజీవరావు అనే యువకుడిని హత్య చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు అకారణంగా తమ గ్రామానికి చెందిన యువకుడిని చంపారంటూ మావోయిస్టులపై పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు. గ్రామస్థుల రాళ్ళ దాడిలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ సీనియర్, డీసీఎం శరత్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu