భర్త వేధించాడని దారుణంగా చంపేసింది...

 

కట్టుకున్న భర్త వేధింపులను ఒక దశ వరకూ భరించిన భార్య ఇక భరించలేక అతనిని హతమార్చింది. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. దస్తగిరి, చిట్టెమ్మ అనే భార్యాభర్తలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. అయితే దస్తగిరి ఎంతోకాలంగా భార్యమీద అనుమానంతో వేధిస్తున్నాడు. దీని మీద ఇద్దరూ ప్రతిరోజూ ఇద్దరూ గొడవపడేవారు. భర్త వేధింపులు మితిమీరడంతో చిట్టెమ్మ నిద్రిస్తున్న ఆదివారం అర్థరాత్రి దస్తగిరి తలపై రాయితో మోది దారుణంగా హత్య చేసింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu