దేశంలో ‘పింక్ టెర్రరిజం’... మేనకాగాంధీ
posted on Sep 15, 2014 12:35PM

కేంద్రమంత్రి మేనకాగాంధీ దేశంలో కొత్తరకం తీవ్రవాదం పెరిగిపోతోందని అన్నారు. ఆ తీవ్రవాదానికి ఆమె ‘పింక్ టెర్రరిజం’ అని పేరు పెట్టారు. అక్రమంగా జంతువులను వధిస్తూ, ఆ డబ్బును ఉగ్రవాదానికి, బాంబుల తయారీకి కొంతమంది ఉపయోగిస్తున్నారని ఆమె చెప్పారు. దీనికి ఆమె ‘పింక్ టెర్రరిజం’ అని పేరు పెట్టారు. పాలిచ్చే జంతువులను వధిస్తూ, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఆ డబ్బుతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. ఇందులో మత ప్రసక్తి లేదని ఆమె వివరించారు. జంతువుల హక్కుల గురించి పోరాడుతున్న మేనకా గాంధీ ఇండియా ఫర్ యానిమల్స్ అనే సదస్సులో మాట్లాడుతూ ఈ ‘పింక్ టెర్రరిజం’ గురించి ప్రస్తావించారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు నాలుగేళ్ళ క్రితమే ఈ తీవ్రవాదం గురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు. పాలిచ్చే జంతువులను వధించడం.. దానికితోడు ఆ డబ్బును ఉగ్రవాదానికి ఉపయోగించడం విశృంఖలంగా సాగుతున్నందున.. దీన్ని అడ్డుకోడానికి అందరూ కృషిచేయాలని, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె పిలుపు ఇచ్చారు.