పాపం విజయవాడ: వెంకయ్య జాలి..
posted on Sep 15, 2014 12:45PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడను చూస్తే తనకు జాలి వేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ విమానాశ్రయం చాలా దయనీయ స్థితిలో వుందని, విజయవాడ నగరం సరైన సదుపాయాలు లేకుండా వుందని, నగరపాలక సంస్థ దుస్థితిని చూస్తే బాధేస్తోందని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీల మీద విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విజయవాడ ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం ఖరారు అయినట్టేనని ఆయన చెప్పారు.