పొన్నాల గోచీ మీద టీ విద్యామంత్రి కామెంట్లు

 

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గోచీ మీద కామెంట్లు చేశారు. పొన్నాల లక్ష్మయ్య గోచీని కాంగ్రెస్ వాళ్లే ఊడగొడతారని జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ని ప్రజలు తరిమి కొడతారని పొన్నాల అంటున్నారని, నిజానికి కాంగ్రెస్ పార్టీవాళ్ళే పొన్నాల గోచీ ఊడగొడతారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఘాటైన పదజాలంతో హెచ్చరించారు. కేసీఆర్ వందరోజుల పాలనలో ఎలాంటి అభివృద్ధీ చేయలేదంటున్న పొన్నాల గతంలో ఆంధ్రావాళ్ళ కాళ్ళు మొక్కి పదవులు కాపాడుకుంటూ వచ్చారని జగదీష్ రెడ్డి విమర్శించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతగాని దద్దమ్మలని, వారిద్దరూ నల్లగొండ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని కనీసం ఎడమకాలువకు నీరు కూడా విడుదల చేయించలేదని మంత్రి మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu