మహారాష్ట్ర కొత్త గవర్నర్ కోహ్లీ
posted on Aug 24, 2014 5:01PM
మహారాష్ట్ర నూతన గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యాక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ ఎస్ షా ఆయనే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇతర మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు తనను మహారాష్ట్ర నుంచి బదిలీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ ప్రకటించారు. అయినప్పటికీ ఆయనని కేంద్ర ప్రభుత్వం మిజోరం రాష్ట్రానికి బదిలీ చేసింది. దాంతో తాను చెప్పినట్టే శంకర్ నారాయణ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో యుపిఎ హయాంలో నియమితులైన గవర్నర్లలో మరో వికెట్ పడినట్టు అయింది. శంకర్ నారాయణ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారు. మహారాష్ట్ర గవర్నర్గా యుపిఎ హయాంలో నియమితులైన శంకర్ నారాయణ తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఎన్డీయే గవర్నమెంట్ కోరినప్పటికీ అలా చేయకుండా ఇంతకాలం భీష్మించుకుని కూర్చున్నారు. 82 సంవత్సరాల వయసున్న శంకర్ నారాయణ పదవీ కాలం సాధారణంగా అయితే 2017 వరకూ వుంది.