కేసీఆర్ రిటర్స్న్

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. సింగపూర్‌, మలేసియా దేశాల పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరారు. కేసీఆర్‌ జీవితంలో తొలిసారి చేసిన ఈ విదేశీ పర్యటన ఇది. ఐఐఎం పూర్వ విద్యా్ర్థుల సమ్మేళనంలో పొల్గొనడం, తెలంగాణకు విదేశీ పరిశ్రమలను ఆహ్వానించడం, తెలంగాణలోని జన జీవనాన్ని మెరుగుపర్చడానికి సింగపూర్, మలేసియాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయడంకోసం ఈ పర్యటన జరిపారు. కేసీఆర్ తన పర్యటన మొదటి రోజు 20వ తేదీన సింగపూర్‌లో అక్కడి జేటీసీ కార్యాలయాన్ని సందర్శించారు. 21న పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. 23న సింగపూర్‌ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కారులో ప్రయాణించి మార్గమధ్యన ఉన్న శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌ను పరిశీలించారు. పర్యటనలో చివరి రోజు ఆదివారం నాడు మలేషియా మోనో రైల్‌ ప్రాజెక్టు, పుత్రజయ ప్రాంతాన్ని పరిశీలించారు.