దొరల తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ

 

 

కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న హడావుడి నేపథ్యంలో వచ్చేది దొరల తెలంగాణ కాదని, సామాజిక తెలంగాణ అని అంటున్నారు. గతంలో తెలంగాణలో దొరలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయని, ఇప్పుడు అదే దొరలు తెలంగాణతో లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. జులై లేదా ఆగస్టులో తెలంగాణ ఖాయం అని, లక్షకోట్ల రూపాయల ప్యాకేజీలతో తెలంగాణ కోసం జరిగిన బలిదానాలు కొనలేరని, ఆంధ్ర నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని అన్నారు. కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎంపీలు వివేక్, మందా జగన్నాధంలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువస్తామని అన్నారు.