నక్సలిజం పుట్టింది సీమాంధ్రలోనే!

 

 Congress MP Manda Jagannadham, Manda Jagannadham TRS, Telangana issue

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోర్ కమిటిలో తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. నక్సలిజం పుట్టింది సీమాంధ్రలోనని ఆయన అన్నారు. కిరణ్ సీఎంలా కాకుండా సీమాంధ్ర నేతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో సీఎంగా కిరణ్ విఫలమయ్యారని విమర్శించారు. కోర్‌ కమిటీకి ఇచ్చిన నివేదికను సీఎం కిరణ్ లీక్ చేసి అనైతికతకు దిగుతున్నారని అన్నారు. సీఎం నివేదికను తెలంగాణ నేతలు ఖండించాలని కోరారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని అన్నారు.