విద్యార్థిగా మారి చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన లోకేష్
posted on Jul 7, 2025 4:12PM

మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్ హై స్కూల్ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా చిన్నారులతో లోకేష్ ఫొటోలు దిగారు. అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన వీఆర్ హై స్కూల్ను స్కూల్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పీ4 కింద స్కూలు అభివృద్ధికి ముందుకు వచ్చిన పొంగూరు షరణి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజులను లోకేష్ సత్కరించారు. అనంతరం పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించిన ఆయన కొద్ది సేపు విద్యార్థిగా మారిపోయి చిన్నారులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.