"మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్" గా కేటీఆర్..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు అరుదైన అవార్డు దక్కింది. ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ "రిట్జ్" ప్రముఖ సీఎన్ఎన్ఐబిఎన్ ఛానల్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న "ఆడి రిట్జ్ ఐకాన అవార్డ్ 2015" కింద "మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్" అవార్డ్  కేటీఆర్ కు దక్కింది. ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎన్నో వినూత్న పథకాలు ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ అవార్డ్ దక్కింది. ఈ నెల 13న బెంగుళూరులో తాజ్ వెస్టండ్ హోటల్లో జరిగే ఈకార్యక్రమంలో కేటీఆర్ కు అవార్డు అందజేయనున్నారు. కేటీఆర్ తో పాటు మరికొంత మంది.. వివిధ విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. వారిలో సినీ నటుడు రాం చరణ్ కూడా ఉన్నారు. సినీ రంగానికి చెంది టాలీవుడ్ నుండి రాం చరణ్, బాలీవుడ్ నుండి విద్యాబాలన్, వ్యాపార రంగంలో గ్రంథి మల్లిఖార్జునరావు, ఫ్యాషన్ రంగానికి గౌరంగ్ షాకి.. సాంకేతిక రంగంలో నందన నిలేకనిలకు అవార్డులు దక్కాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu