దావూద్ పై అమెరికా కన్ను..?

అండర్ వరల్డ్ డాన్.. ముంబై వరుస పేలుళ్ల కారకుడు దావుద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి భారత్ ప్రభుత్వం చాలా తీవ్రతరంగా కృషిచేస్తుంది. కానీ పాక్ సహకారం సరిగ్గా లేకపోవడంతో దావూద్ ను ఇండియాకి రప్పించలేకపోతుంది మన ప్రభుత్వం. కానీ ఇప్పుడు దావుద్ ను పట్టుకోవడానికి మార్గం సులువైనట్టు తెలుస్తోంది. అదెలా అంటే.. అగ్రరాజ్యాలపై ఐసిస్ కన్నేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్రరాజ్యాలు ఐసిస్ అంతు తేల్చే పనిలో పడింది. అయితే ఐసిస్ కు దావూద్ సహాయం అందుతోందన్న అనుమానంతో ఇప్పుడు దావుద్ పై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఐతే గతంలో పాక్ తో ఉన్న సత్సంబంధాలు కారణంగా అగ్రరాజ్యాలు ఐసిస్ ను చూసి చూడనట్టు వదిలేశాయి. కానీ తమపైనే దాడి చేసేసరికి కోపంతో ఉన్న అగ్రరాజ్యాలు ఇప్పుడు ఐసిస్ పై.. దానికి సహరిస్తున్నారన్న కారణంగా దావుద్ పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దావూద్ ముఖ్య అనుచరుడు.. ఆయన ఆర్థిక వ్యవహారాల సలహాదారు అల్తాఫ్ ఖనానీని అమెరికా అరెస్టు చేసింది. ఖనాని అరెస్ట్ చేసినందుకుగాను అమెరికా దావూద్ ను టార్గెట్ చేసిందని అనుకుంటున్నారు. దీంతో మన దేశ ప్రభుత్వం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న దావుద్ త్వరలోనే కలుగు నుండి బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu