కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
posted on Jun 13, 2025 3:46PM
.webp)
ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం జూన్ 16న 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ అధికారంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. రాజధాని నగరం హైదరాబాద్ నడిబొడ్డున ఓవైపు హుస్సెన్ సాగర్, మరోవైపు కొత్త సచివాలయం మధ్య ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల మేర ఈ కారు రేస్ సాగింది.
ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డును సంసిద్దం చేసారు. ఫిబ్రవరి 11, 2023 లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్టోబర్ 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవో కు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని అంటోంది. అంతేకాదు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బిఐ నిబంధనలు పాటించలేరని తమ విచారణలో తేలినట్లు చెబుతోంది.