'నన్ రేప్' నిందితుల పట్టివేత

 

కోల్కత్తాలోని నాడియా జిల్లాలో గంగ్నాపూర్ లో శుక్రవారం అర్ధరాత్రి 72 సంవత్సరాల నన్ పై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి తరువాత స్కూల్లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగల్లో నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకొన్నపశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించింది. ఘటన జరిగిన ప్రాంతంలో సీఐడీ పోలీసులు సీసీటీవీ పుటేజ్ను సొంతం చేసుకొని నలుగురు నిందితులను గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టగా ఎనిమిదిమంది పట్టుబడ్డారు. మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, నిందితులను అరెస్ట్ చేయడానికి అవసరమైన వివరాలు చెప్పినవారికి రూ. లక్ష బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu