ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు థాంక్స్: స్పీకర్ కోడెల

 

తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు డాక్టర్ కోడెల శివప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి వుందని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలోని ప్రతి సభ్యుడి మీద ఆంధ్రప్రదేశ్‌ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత వుందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు చాలా అర్థవంతంగా జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభాపతి అంటే మోనార్క్ కాదని ఆయన చెప్పరాు. ప్రజా సమస్యలను చర్చించే విషయంలో సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా నూతన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. గతంలో టెంట్ల కింద సమావేశాలను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.